
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ వల్లే కృష్ణా ట్రిబ్యునల్ఏర్పాటు ఆలస్యమైందని బీజేపీ కోర్కమిటీ సభ్యుడు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎంతో కేసీఆర్ కుమ్మక్కయ్యారనే విషయాన్ని రాష్ట్ర రైతులు గుర్తించాలని ఒక ప్రకటనలో కోరారు. సీఎంవైఖరితో తెలంగాణ నష్టపోతున్నందువల్లే కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర నిర్ణయంతో 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. విభజన చట్టంలోని సెక్షన్89కి ఇబ్బంది లేకుండా కృష్ణా ట్రిబ్యునల్కు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించిందని వివరించారు.