ఆరు నెలలుగా పెండింగ్‌లో.. పిట్లం ప్రధాన రహదారి విస్తరణ

ఆరు నెలలుగా పెండింగ్‌లో.. పిట్లం ప్రధాన రహదారి విస్తరణ

పిట్లం, వెలుగు:  పిట్లం ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో  దుకాణదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలల క్రితం రోడ్డు విస్తరించి సెంట్రల్​ లైటింగ్​ కోసం రోడ్డు పక్కన తవ్వకాలు చేసి కంకర వేసి వదిలేశారు. ఇందులో భాగంగా పాత మురుగు కాలువను తవ్వేసి వదిలేయడంతో వినియోగదారులు దుకాణాలలోకి వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. 

దుకాణ దారులు కాలువపై చెక్కలువేసుకున్నా ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్డు విస్తరణ పనులకు రూ. 12 కోట్లు మంజూరు కాగ ఎనిమిది నెలల క్రితం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్​ దీపావళి అనంతరం పనులు నిలిపివేశాడు. అప్పటి నుంచి ఇబ్బందులు తప్పడం లేదని వ్యాపారులు తెలిపారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.