న్యూఢిల్లీ: ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కార్డియో న్యూరో సెంటర్ లో పని చేసే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు 30 మంది బుధవారం క్వారంటైన్లోకి వెళ్లారు. న్యూరలాజికల్ ప్రాబ్లమ్తో ట్రీట్మెంట్కు వచ్చిన 72 సంవత్సరాల పేషెంట్కు కరోనా పాజిటివ్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ తో రెండు రోజుల క్రితం ఎయిమ్స్కు రావడంతో వెంటనే టెస్ట్లు చేసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించడానికి న్యూరాలజీ వార్డులో అతడ్ని చేర్చారు. సీటీ, ఎమ్ ఆర్ఐ పరీక్షలు చేసి అబ్జర్వేషన్లో ఉంచారు.
తనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్లకు చెప్పాడు. దీంతో కరోనా టెస్ట్చేయించగా అతడికి పాజిటివ్గా తేలింది. వెంటనే ఆ పేషెంట్ను కొవిడ్ హాస్పిటల్గా మార్చిన ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించామని ఒక అధికారి తెలిపారు. దీంతో అతనికి ట్రీట్మెంట్ చేసిన 30 మంది హెల్త్ కేర్ వర్కర్లందరూ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.