ఢిల్లీ ఎయిర్పోర్టుకు 3గంటల ముందే రండి.. ప్రయాణికులకు ఇండిగో సూచన

ఢిల్లీ ఎయిర్పోర్టుకు 3గంటల ముందే రండి.. ప్రయాణికులకు ఇండిగో సూచన

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఇండిగో కీలక ప్రకటన చేసింది. దేశీయంగా విమాన ప్రయాణం చేయాల్సిన వారు 3 నుంచి 5 గంటల ముందు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది. సుమారు 7కిలోల బరువు ఉన్న ఒకే బ్యాగ్ తో వస్తే వీలైనంత త్వరగా సెక్యూరిటీ క్లియరెన్స్ లభిస్తుందని చెప్పింది. చెక్ ఇన్, బోర్డింగ్‭కు ఎక్కువ సమయం పట్టొచ్చని తెలిపింది. అలాగే ప్రయాణికులు వారి వెబ్ చెక్ ఇన్‭ను పూర్తి చేసుకుని రావాలని సూచించింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 3లోకి ప్రవేశించడానికి గేట్‌ నం:5, గేట్‌ నం: 6 మార్గాలను ఎంచుకోవాలని కోరింది.  

ఇప్పటికే అధికారులు ఈ విమానాశ్రయంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉదయం రద్దీ వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించనున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు.