పంజాబ్‌ కింగ్స్‌ టార్గెట్‌ -160

 పంజాబ్‌ కింగ్స్‌ టార్గెట్‌ -160

ముంబై:  పంజాబ్ సూపర్ కింగ్స్‌తో ఇక్కడి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 4 పోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సర్ఫరాజ్ ఖాన్ 32 (16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్), లలిత్ యాదవ్ 24, అక్షర్ పటేల్ 17(నాటౌట్) పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్షదీప్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.  పంజాబ్‌, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో చెరి 12 పాయింట్లు (12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) సాధించి పాయింట్ల పట్టికలో సమంగా ఉన్నాయి. అయితే పంజాబ్‌ (0.023)తో పోలిస్తే.. ఢిల్లీ (0.210) నెట్‌ రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు ఐదో స్థానంలో, పంజాబ్‌ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ​ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధించినా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.