
- జన్ ఆక్రోశ్ ర్యాలీలో కేజ్రీవాల్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులకు దిగుతున్నారని, అయినా కేంద్రం ఏం చేయట్లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ను హ్యాండిల్ చేయలేదని, ఇలాంటి దాడులు ఆపేందుకు యాక్షన్ ప్లాన్ కూడా లేదని గుస్సా అయ్యారు. లోయలో జరుగుతున్న వరుస హత్యలకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జంతర్ మంతర్ వద్ద జన్ ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించగా.. కేజ్రీవాల్ పాల్గొని మాట్లాడారు. కాశ్మీరీ పండిట్లు మళ్లీ జమ్మూను వదిలేస్తున్నారని, 1990 నాటి పరిస్థితులు రిపీట్అవుతున్నాయన్నారు. బీజేపీ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. కాశ్మీర్లో టెర్రరిస్టు దాడులకు పాకిస్తాన్ మద్దతిస్తోందన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగంగానే ఉంటుందని తేల్చి చెప్పారు. మే 1 నుంచే టెర్రరిస్టులు ఈ దాడులు చేస్తున్నారని, ఇప్పటిదాకా 8 మంది చచ్చిపోయారని కేజ్రీవాల్ చెప్పారు.
మరిన్ని వార్తల కోసం...