బిడ్డల కోరికలు కాదనే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా చెప్పండి? కానీ ఒక చోట కూతురు కోరిక నెరవేర్చడానికి తల్లిదండ్రులు చేసిన పని తెలుస్తే మీరు విస్తుపోతారు.
ఆమె కోరిక నెరవేర్చడానికి ఏకంగా నెల వయసున్న బాలుడ్నే కిడ్నాప్ చేశారు పేరెంట్స్. కంగుతినిపించేలా ఉన్న ఈ వార్త వివరాలు.. దేశ రాజధాని దిల్లీలోని ఠాగూర్గార్డెన్లోని రఘుబీర్నగర్కు చెందిన సంజయ్గుప్తా, అనితాగుప్తా కు కుమారుడు గతేడాది మృతి చెందాడు.
అప్పటి నుంచి కుమార్తె ను జంట అపురూపంగా చూసుకుంటోంది. ఏది కోరినా కాదనకుండా చేస్తోంది. అయితే అన్న లేడనే బాధ ఆ చెల్లెకు ఆవేదన మిగిల్చింది. రానున్న రాఖీ పండుగ రోజు తాను రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని కుమార్తె పేరెంట్స్ ని కోరింది.
ఆలోచనలో పడ్డ తల్లిదండ్రులు ఆమె కోరిక నెరవేర్చడానికి నిర్ణయించుకున్నారు. ఆగస్టు 23న రాత్రి పూట బైకుపై తిరుగుతూ రైల్చౌక్ లో ఫుట్పాత్పై పడుకున్న దంపతుల నెల రోజుల వయసున్న కుమారుడిని కిడ్నాప్ చేశారు.
బాబు పేరెంట్స్ లేచి చూసే సరికి చిన్నారి కనిపించకపోవడంతో వారు పోలీసులకు కంప్లెంట్ఇచ్చారు. విచారణ ప్రారంభించిన పోలీసులు దంపతులే కిడ్నాప్ కి పాల్పడినట్లు గుర్తించి వారి నివాసంలో నిందితులను అరెస్ట్ చేశారు. సంజయ్ ట్యాటూ ఆర్టిస్ట్గా పని చేస్తున్నాడని, అతనిపై 3 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.