రాఖీ కట్టించడానికి నెల వయసున్న పిలగాడ్ని కిడ్నాప్​ చేసిన తల్లిదండ్రులు

రాఖీ కట్టించడానికి నెల వయసున్న పిలగాడ్ని కిడ్నాప్​ చేసిన తల్లిదండ్రులు

బిడ్డల కోరికలు కాదనే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా చెప్పండి? కానీ ఒక చోట కూతురు కోరిక నెరవేర్చడానికి తల్లిదండ్రులు చేసిన పని తెలుస్తే మీరు విస్తుపోతారు. 

ఆమె కోరిక నెరవేర్చడానికి ఏకంగా నెల వయసున్న బాలుడ్నే కిడ్నాప్​ చేశారు పేరెంట్స్. కంగుతినిపించేలా ఉన్న ఈ వార్త వివరాలు.. దేశ రాజధాని దిల్లీలోని ఠాగూర్​గార్డెన్​లోని రఘుబీర్​నగర్​కు చెందిన సంజయ్​గుప్తా, అనితాగుప్తా కు కుమారుడు గతేడాది మృతి చెందాడు. 

అప్పటి నుంచి   కుమార్తె ను జంట అపురూపంగా చూసుకుంటోంది. ఏది కోరినా కాదనకుండా చేస్తోంది. అయితే అన్న లేడనే బాధ ఆ చెల్లెకు ఆవేదన మిగిల్చింది. రానున్న రాఖీ పండుగ రోజు తాను రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలని కుమార్తె పేరెంట్స్ ని కోరింది. 

ఆలోచనలో పడ్డ తల్లిదండ్రులు ఆమె కోరిక నెరవేర్చడానికి నిర్ణయించుకున్నారు. ఆగస్టు 23న రాత్రి పూట బైకుపై తిరుగుతూ రైల్​చౌక్ లో ఫుట్​పాత్​పై పడుకున్న దంపతుల నెల రోజుల వయసున్న కుమారుడిని కిడ్నాప్​ చేశారు. 

బాబు పేరెంట్స్ లేచి చూసే సరికి చిన్నారి కనిపించకపోవడంతో వారు పోలీసులకు కంప్లెంట్​ఇచ్చారు. విచారణ ప్రారంభించిన పోలీసులు దంపతులే కిడ్నాప్ కి పాల్పడినట్లు గుర్తించి వారి నివాసంలో నిందితులను అరెస్ట్​ చేశారు. సంజయ్ ​ట్యాటూ ఆర్టిస్ట్​గా పని చేస్తున్నాడని, అతనిపై 3 క్రిమినల్​ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.