ఢిల్లీ రోహిణిలోని బాబా వీరేంద్ర దీక్షిత్ ఆధ్యాత్మిక ఆశ్రమం బాధ్యతలను మాజీ ఎల్జీ కిరణ్ బేడీకి అప్పగించింది ఢిల్లీ హైకోర్టు. ఆశ్రమంలోని మహిళల ఆరోగ్య, మానసిక, సంక్షేమ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించేందుకు కిరణ్ బేడీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది కోర్టు. కమిటీలో రోహిణీ జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ మహిళా నేర విభాగం DCP, ఢిల్లీ మహిళా కమిషన్, జిల్లా న్యాయ సేవల విభాగం కార్యదర్శిలను సభ్యులుగా నియమించింది. త్వరలో వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమాన్ని సందర్శించి హైకోర్టుకు నివేదిక ఇవ్వనుంది కిరణ్ బేడీ కమిటీ. తదుపరి విచారణ మే 27కి వాయిదా వేసింది కోర్టు.
Delhi HC appoints Kiran Bedi to supervise committee formed to monitor Rohini Ashram
— ANI Digital (@ani_digital) April 26, 2022
Read @ANI Story | https://t.co/I6MM1f2u65
#DelhiHC #KiranBedi #RohiniAshram pic.twitter.com/qqAtp6lBIg