జొమాటోలో ఒక్కడే 3,330 ఆర్డర్లు పెట్టిండు

జొమాటోలో ఒక్కడే 3,330 ఆర్డర్లు పెట్టిండు

ఫుడ్ అగ్రిగేటర్ జొమాటోలో ఈ ఏడాది ఎక్కువ ఆర్డుర్లు చేసి ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి రికార్డు సృష్టించారు. ఢిల్లీకి చెందిన అంకుర్ జొమాటో యాప్ ద్వారా ఏడాదిలో 3,330 ఆర్డర్లను చేశాడు. ఆయన రోజుకు సరాసరిన 9 ఆర్డర్లు చేశాడని జొమాటో వెల్లడించింది. 2022 ట్రెండ్స్ రిపోర్టులో ఈ విషయాన్ని ప్రకటించింది. 

ఈ ఏడాది ఎక్కువగా బిర్యానీని ఆర్డర్ చేసినట్లు జొమాటో తెలిపింది. 2022లో దేశవ్యాప్తంగా జొమాటో యాప్ లో ప్రతి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఈ రిపోర్టును చూస్తే ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీయేనని మరోసారి రుజువైంది. మరోవైపు స్విగ్గీలోనూ ఎక్కువగా ఆర్డర్ చేయబడిన వంటకాల్లో బిర్యానీ టాప్ ప్లేస్ లో నిలిచింది. 2022లో ప్రతి నిమిషానికి 137 బిర్యానీలను డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఇక డిస్కౌంట్ ప్రోమో కోడ్‭లను ఉపయోగించుకునే విషయంలో పశ్చిమబెంగాల్ లోని రాయ్ గంజ్ అగ్రస్థానంలో నిలిచింది. 2022లో అక్కడి కస్టమర్లలో 99.7 శాతం మంది డిస్కౌంట్ ప్రోమో కోడ్‭ లు ఉపయోగించి ఆర్డర్ చేశారు. జొమాటో యాప్ లో బిర్యానీ తర్వాత ప్లేస్ లో పిజ్జా ఉంది. ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చాయని ఆ సంస్థ తెలిపింది.