- ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కోత పెడుతూ కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్కుమార్ ఒక ప్రకటనలో కోరారు. కేంద్రం ప్రతిపాదించిన నేషనల్ క్యాపిటల్ ఏరియా ఢిల్లీ గవర్నమెంట్(అమెండ్మెంట్)–2023 బిల్లు రాష్ట్రాల హక్కులను హరించేదన్నారు. ఈ బిల్లు ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ(ఎన్సీడీటీ)లో ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని బలహీనపరుస్తుందన్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై లెఫ్టినెంట్గవర్నర్కు అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. దీనికి ఆమోదముద్ర పడితే ప్రజాస్వామ్యం బలహీన పడుతుం దన్నారు. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమన్నారు.

