ఢిల్లీలో పొగమంచు: ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు

ఢిల్లీలో పొగమంచు: ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు

ఢిల్లీని పొగమంచు వీడడం లేదు. దీంతో రైళ్లు, విమాన ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. ఢిల్లీలో 16 రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో 1 మిల్లీమీటర్ వర్షం కురిసింది. ఇవాళ కూడా ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. లూథియానా, సిమ్లా, డెహ్రాడూన్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోయింది.