
సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అదనపు అధ్యక్షుడు జి.తిరుపతి రెడ్డి, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్ అన్నారు. ఆదివారం పీడీఎస్ యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ భవన్ లో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వారంరోజుల క్రితం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార గణేశ్, విద్యార్థుల తల్లిదండ్రులు, బాలనర్సు, స్వామి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.