జీవో నెం 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలి: పోలీస్ అభ్యర్థులు

జీవో నెం 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలి: పోలీస్ అభ్యర్థులు

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. 2018 సంవత్సరంలో నోటిఫికేషన్ ఆధారంగా నియమాకాలు చేపడితే అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల అభ్యర్థులకు సమన్యాయం జరుగుతుందని భావించి... ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ లో జీవో 46ను ప్రవేశపెట్టిందని అభ్యర్థులు తెలిపారు. ఈ జీవో వల్ల 33 జిల్లాల అభ్యర్థులకు న్యాయపరమైన రేషియో అమలవుతుందని పేర్కొన్నారు. 

ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన కొంత మంది కానిస్టేబుల్ అభ్యర్థులు... జీవో 46 ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ జీవోను రద్దు చేస్తున్నారంటూ  కొన్ని రోజులుగా కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జీవో 46ను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.