మూడు చోట్ల హైడ్రా హై అటెన్షన్ : ఆదివారం హైడ్రా కూల్చివేతల పరంపరా

మూడు చోట్ల హైడ్రా హై అటెన్షన్ : ఆదివారం హైడ్రా కూల్చివేతల పరంపరా

చెరువులు, నాలాలు ఆక్రమించిన భూకబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట 12వ సర్వే నంబర్ లోని అక్రమ నిర్మాణాలను (ఆదివారం) సెప్టెంబర్ 22న కూల్చివేతలు ప్రారంభమైయ్యాయి. పటేల్ గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వేనెంబర్ 6 పేరుతో,  కిష్టారెడ్డిపేట లోని 12వ  ప్రభుత్వ సర్వే నంబర్ లో నిర్మించిన సుమారు 16  అక్రమ కట్టడాలను హైడ్రా గుర్తించింది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆయా బిల్డింగులను అధికారులు కూల్చివేస్తున్నారు. 

ఈ నిర్మాణాలు ప్రముఖ బిఆర్ఎస్ నాయకుడివి అని సమాచారం.  అటు కూకట్ పల్లి నల్లచెరువు బఫర్ జోన్, ఎల్టీఎఫ్ పరిధిలో నిర్మించిన కట్టడాలను కూడా హైడ్రా ఈ రోజే కూల్చివేస్తోంది. అధికారులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైడ్రా ఆద్వర్యంలో ఈరోజు మొత్తం మూడు చోట్లు కూల్చివేతలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర క్యాబినేట్ హైడ్రాకు హైపవర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.