‘డబుల్’ ఇండ్ల ఫేక్ ​కాల్స్​ నమ్మొద్దు

‘డబుల్’ ఇండ్ల ఫేక్ ​కాల్స్​ నమ్మొద్దు
  • డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి సూచన

హైదరాబాద్, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ కొందరు ఫేక్​కాల్స్​చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి సూచించారు. కొల్లూరులోని డబుల్​బెడ్​రూమ్​ఇండ్లను ఆశచూపి పైసలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 

ఇండ్లకు సంబంధించిన అధికారిక నివేదికను ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇస్తారని చెప్పారు. ఫేక్​కాల్స్ కు స్పందించవద్దని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.