తార్నాక, వెలుగు: ఓయూ పోలీస్ స్టేషన్ లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సీఐ అప్పలనాయుడు శుక్రవారం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని తార్నాకలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నవించారు. పీఎస్ లో రోడ్ల దుస్థితి, స్ట్రీట్ లైట్ల సమస్యలు, చెట్ల కొమ్మలు, ప్రహరీ ప్రాంతంలో నీటి సమస్యను మేయర్కు వివరించారు.
భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ మేయర్.. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించేలా చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.
