తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదగిరిగుట్ట దేవస్థానానికి భక్తులు వివిధ రూపాల్లో అందించిన కానుకల ద్వారా ఆగస్టు 13న రూ.55 లక్షల 16 వేల నగదు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండిందని వెల్లడించారు. ఆలయంలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి గంట సమయం పడుతుందని వివరించారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అరగంట సమయం పడుతుందని చెప్పారు.