మేడారం జాతర .. కోయగిరిజన పద్ధతిలోనే పూజలు

మేడారం జాతర .. కోయగిరిజన పద్ధతిలోనే పూజలు

మేడారం 365 రోజుల జాతరగా మారినప్పటికీ కోయ గిరిజన పద్ధతిలోనే భక్తులు పూజలు చేయాల్సి ఉంటుంది. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఇక్కడ  ప్రత్యేకత. ఏ మంత్రోచ్ఛారణలు లేకుండా, విగ్రహారాధన చేయకుండా, ఏ మత ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారుల(వడ్డెలు) ఆధ్వర్యంలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. భక్తులంతా సమ్మక్క, సారలమ్మల ప్రతిరూపాలైన గద్దెలను తాకి తన్మయత్వం పొందుతారు.

శివసత్తుల పూనకాలు, వడిబియ్యం సమర్పణ, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, కోయదొరల భవిష్యవాణి, జంపన్న వాగులో స్నానాలు, తలనీలాల సమర్పణ, ఎదురు కోళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించడం, లక్ష్మి దేవర వేషాలు, మహిళల వేషధారణలో ఉండే పురుషుల ఆట పాట వంటి దృశ్యాలు మేడారంలో కనిపిస్తుంటాయి. ఆఫీసర్లు ఏర్పాట్లు చేయడమే తప్ప పూజలో నేరుగా పాలుపంచుకోరు. మేడారం మహాజాతర, మినీ మేడారం జాతర సమయంలోనే కాకుండా ప్రతీ రోజు గద్దెల వద్ద కోయ పూజారులే ఉంటారు. జాతర ఆదాయంలో కూడా కోయ పూజారులకే మూడో వంతు వాటా ఇస్తారు.