యాదాద్రి నుంచి అయోధ్యకు తరలిన భక్తులు

యాదాద్రి నుంచి అయోధ్యకు తరలిన భక్తులు

యాదాద్రి, వెలుగు: భువనగిరి పార్లమెంట్​ నుంచి అయోధ్యలో శ్రీరామచంద్రుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. అయోధ్యకు వెళ్లే స్పెషల్​ ట్రైన్​ సికింద్రాబాద్​ నుంచి యాదాద్రి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్​కు ఆదివారం సాయంత్రం చేరుకుంది. 

ఈ  ట్రైన్​లో 1350 మంది భక్తులకు ముందుగానే రిజర్వేషన్​ చేశారు. పార్లమెంట్​పరిధిలోని వీరంతా భువనగిరికి చేరుకొని ఇక్కడి నుంచి అయోధ్యకు తరలివెళ్లారు. ఈ ట్రైన్‌‌‌‌ను బీజేపీ స్టేట్​జనరల్​ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు, పాపారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్​, మల్లేశం, పడాల  శ్రీనివాస్​, బందారపు లింగస్వామి, చిరిగె శ్రీనివాస్​, రత్నపురం శ్రీశైలం, చందా మ హేందర్​ గుప్తా, రత్నపురం బలరాం ఉన్నారు.