జనసంద్రమైన కీసర

జనసంద్రమైన కీసర

మేడ్చల్ జిల్లా : మహా శివరాత్రి పర్వదినం వేళ కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేశారు. కీసర గుట్టకు తెల్లవారుజామునే భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న శివలింగాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.