బీఆర్ఎస్ జెండాలు మోసేవారికే దళితబంధు: కాట శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్ జెండాలు మోసేవారికే దళితబంధు: కాట శ్రీనివాస్ గౌడ్

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా జాతీయ రహదారిపై నియోజకవర్గ ఇంచార్జీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాలు కేవలం బీఆర్ఎస్ జెండాలు మోసేవారికే ఇస్తున్నారని కాట శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద దళితులకు కాకుండా.. కోట్ల రూపాయలు ఉన్న ధనవంతులకే దళిత బంధు పథకాన్ని ఇస్తున్నారని విమర్శించారు. అర్హులైన వారందరికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందజేస్తామని తెలిపారు.