‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ ఇటీవలే సంక్రాంతి సందర్భంగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి అభిషేక్ దర్శకత్వం వహించారు. ఇందులో దీక్షిత్ శెట్టికి జోడీగా బ్రిందా ఆచార్య నటించారు. అలాగే సాధు కోకిల, శృతి హరిహరన్, గోపాలకృష్ణ దేశ్పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఓ గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉంటారు. ఈ క్రమంలో ఓ ప్లాన్ వేస్తారు. అలా ఎలక్షన్ టైంలో ఓ చిన్న దోపిడీకి ప్రయత్నించడంతో అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు. దీంతో పాటు స్థానిక రాజకీయ నాయకుల నుంచి కూడా వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ ఈ కథనం సాగిన తీరు ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది.
కథేంటంటే:
కర్ణాటకలో ఎలక్షన్ సీజన్ మొదలవుతుంది. పొలిటికల్ లీడర్లు బ్లాక్ మనీతో ఓట్లు కొంటున్న టైం అది. అప్పుడే కనక అలియాస్ టైగర్ (దీక్షిత్ శెట్టి) తన తెలివితో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని కలలుకంటాడు. దాంతో ఒక దోపిడీకి ప్లాన్ చేస్తాడు.
►ALSO READ | WomenInCinema: నాటకాల స్టేజ్ నుంచి స్క్రీన్ వరకు.. మల్టీ టాలెంటెడ్గా నటి ఆండ్రియా ఇన్స్పిరేషన్ జర్నీ
తన గ్యాంగ్లోని మరో ఐదుగురితో కలిసి భాగ్యలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ని దోచుకునేందుకు వెళ్తాడు. ప్లాస్టిక్ యానిమల్ మాస్కులు, రెంటుకు తీసుకొచ్చిన పాత తుపాకులతో ఎలాంటి ప్లానింగ్ లేకుండానే బ్యాంక్లోకి వెళ్తారు.
కానీ, లాకర్లో కేవలం రూ. 66,999 మాత్రమే ఉంటాయి. అక్కడినుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఫ్రంట్ డోర్ జామ్ అవుతుంది. అప్పటికే పోలీస్లు బ్యాంక్ను చుట్టుముడతారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
