గుర్రంతో ధోనీ పోటీ

గుర్రంతో ధోనీ పోటీ

రాంచీ: ఐపీఎల్​ సెకండ్​ ఫేజ్​కు టైమ్​ దగ్గరపడుతున్న కొద్ది.. చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ కూడా ప్రాక్టీస్​ స్టార్ట్​ చేస్తున్నాడు. అయితే బ్యాట్​తోనో, నెట్స్​లో కాకుండా.. వెరైటీగా గుర్రంతో ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు. ఇటీవలే తన ఫామ్​హౌస్​లోకి వచ్చిన షెట్లాండ్​ పోనీ(గుర్రం)తో రన్నింగ్​ రేస్​ పెట్టుకున్నాడు. దీంతో మహీ క్రమంగా ట్రెయినింగ్​ మోడ్​లోకి వస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీ భార్య సాక్షి..  సోషల్‌‌ మీడియాలో పోస్ట్​ చేసింది. ‘స్ట్రాంగర్​, ఫాస్టర్​’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్​ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన సురేశ్​ రైనా..  ఫైర్​ఎమోజీని కామెంట్​గా పెట్టాడు.