- పాలిష్డ్ డైమండ్స్కు డిమాండ్ లేకపోవడమే కారణం
న్యూఢిల్లీ: ముడి వజ్రాల దిగుమతిని అక్టోబర్15 నుంచి రెండు నెలలపాటు ఆపాల్సిందిగా తన సభ్యులను జెమ్స్అండ్ జ్యుయెలరీ ఇండస్ట్రీ కోరింది. గ్లోబల్గా డిమాండ్ తగ్గడంతోపాటు, దేశంలోని ప్లేయర్ల వద్ద నిల్వలు ఎక్కువవుతుండటంతో ఈ పిలుపును ఇచ్చింది. లూజ్ పాలిష్డ్ డైమండ్స్కు అమెరికా, చైనా వంటి దేశాలలో డిమాండ్తగ్గుతోంది. గత కొన్ని క్వార్టర్లుగా ఈ డిమాండ్ నిలకడగా పడిపోతోంది. 2021, 2022 సంవత్సరాలలో లూజ్ పాలిష్డ్ డైమండ్స్కు డిమాండ్ బాగా పెరిగింది. ఆ తర్వాత నుంచి ఆర్డర్లు క్రమంగా తగ్గాయి. ఈ కారణంగా మన దేశపు వజ్రాల ఎగుమతులు జనవరి–ఆగస్టు 2023 మధ్య కాలంలో 25 శాతం పడిపోయాయి. ఫలితంగా దేశంలోని డైమండ్ ఇండస్ట్రీ వద్ద నిల్వలు పేరుకుపోయాయని, రేట్లు కూడా కొంత తక్కువ లెవెల్లోనే ఉన్నాయని ఒక సర్క్యులర్లో జెమ్స్ అండ్ జ్యుయెలరీ ఇండస్ట్రీ తెలిపింది. ఈ సర్క్యులర్ను జెమ్ జ్యుయెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ), భారత్ డైమండ్ బౌర్స్, సూరత్ డైమండ్ బౌర్స్, ముంబై డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్, సూరత్ డైమండ్ అసోసియేషన్లు కలిసి జారీ చేశాయి. ముడి వజ్రాలను మైనింగ్ కంపెనీలు అమ్ముతూనే ఉన్నాయి.
పాలిష్డ్ డైమండ్స్కు డిమాండ్ ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా మైనింగ్ కంపెనీలు తమ అమ్మకాలు సాగిస్తున్నాయని సర్క్యులర్ వివరించింది. ఇండస్ట్రీలోని చిన్న, మధ్య తరహా సంస్థలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. డిసెంబర్ 2023 మొదటివారంలో మరోసారి పరిస్థితిని రివ్యూ చేసి, నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ముడి వజ్రాల దిగుమతిని వాలంటరీగానే నిలిపివేయమని మెంబర్లను పరిశ్రమ కోరుతోంది. అమెరికాతో పాటు, ఇతర దేశాలలో పాలిష్డ్ డైమండ్స్కు డిమాండ్ పెంచేందుకు జీజేఈపీసీ అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వివరించింది. ఆల్టర్నేటివ్ మార్కెట్ల కోసం వెతుకుతున్నట్లు కూడా జీజేఈపీసీ మాజీ చైర్మన్ కోలిన్ షా చెప్పారు. పరిశ్రమలోని చిన్న, మధ్య తరహా సంస్థల మనుగడ దృష్టిలో ఉంచుకుని గతంలోనూ ఇలాంటి వాలంటరీ బ్యాన్లను అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.