
వెస్ట్ బెంగాల్ బర్దమాన్ జిల్లా కు చెందిన దిగంతికా బోస్ ఇంటర్ చదువుతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇష్టం. కరోనా వైరస్ తో ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన ఇన్నోవేషన్ తో ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉండే దిగంతికా బోస్ కు కరోనా వైరస్ ను అరికట్టేందుకు తన వంతు కృషి చేయాలని అనుకుంది. అనుకున్నదే తడువుగా కేవలం ఏడురోజుల్లో ఓ మాస్క్ ను తయారు చేసింది. ఆ మాస్క్ ను ధరించిన వారు కరోనా నుంచి సురక్షితంగా ఉండటమేకాదు..దాన్ని హతమార్చేలా డిజైన్ చేసింది. డిజైన్ చేసిన తరువాత మాస్క్ ను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బోస్ అనుమతి తీసుకుంది.
ఎలా మొదలైంది
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నిర్వహించిన ఛాలెంజ్ కోవిడ్ -19 పోటీలో 17 ఏళ్ల దిగంతికా బోస్ ఆమె తయారు చేసిన మాస్క్ ను సమర్పించింది. అనేక ఆవిష్కరణలను షార్ట్ లిస్ట్ చేసిన తరువాత ఫైనల్ లిస్ట్ లో ప్రజల్ని కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు దిగంతికా తయారు చేసిన మాస్క్ కు మద్దతు పలికారు.
మాస్క్ ఎలా పనిచేస్తుంది.
మాస్క్ కు రెండు పొరలున్నాయి. ఈ మాస్క్ ధరించిన వ్యక్తి గాలి పీల్చినప్పుడు మొదటి పొరలోకి వెళ్లిన దుమ్ము, దూళితో పాటు వైరస్ యెక్క లిపిడ్ ప్రొట్రీన్ ను నాశనం చేస్తుంది. ఇక రెండో పొర స్వచ్ఛమైన గాలి లోపలికి వెళ్లేందుకు సాయపడుతుంది. సాధారణంగా మాస్క్లు వైరస్ సోకకుండా నియంత్రిస్తాయి. కానీ దిగంతికా డిజైన్ చేసిన మాస్క్ మాత్రం వైరస్ ను అడ్డుకోవడంతోపాటు దాన్ని చంపేస్తుంది కూడా. ఇందులో రెండు పొరలు ఉంటాయి. వీటిల్లో రెండు వాల్వ్స్, ఫిల్టర్లు ఉంటాయి. ఇది కొవిడ్ రోగి నుంచి వెలువడే ప్రతి వైరస్ ను గాలిపీల్చే సమయంలో చంపేస్తుంది. ఇది ప్రధానంగా కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులకు ఉపయోగపడుతుంది.
దేశం కోసం మరిన్ని ప్రయోగాలు చేస్తా
ను తయారు చేసిన మాస్క్ కు కేంద్ర సాంకేతిక మంత్రిత్వశాఖ మద్దతు పలకడంపై సంతోషం వ్యక్తం చేశారు. మాస్క్ ధరిస్తే కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. కేంద్రం సపోర్ట్ మరిచిపోలేను. దేశం కోసం మరిన్ని ప్రయోగాలు చేస్తానని 17ఏళ్ల ఇంటర్ విద్యార్ధిని దిగంతికా బోస్ ఆనందం వ్యక్తం చేశారు.