కథ మారిందా? హీరో మారాడా?.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్

కథ మారిందా? హీరో మారాడా?.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) వరుస క్రేజీ ప్రెజెక్టులను ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో గేమ్ ఛేంజర్(Game changer) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఉప్పెన(Uppena) మూవీ ఫేమ్ బుచ్చిబాబు సన(Buchhibabu sana)తో మరో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. అయితే తాజాగా ఈ సినిమా కథ గురించి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఉప్పెన మూవీ తరువాత బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తో ఓ సినిమా చేయాలని ప్లాన చేశారు. అందుకోసం ఒక పవర్ ఫుల్ స్టోరీని కూడా సెట్ చేసుకున్నాడు. దానికి ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పాడు కానీ.. అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి.. లిస్టులోకి చరణ్ వచ్చాడు. 

దీంతో బుచ్చిబాబు చరణ్ తో చేస్తున్న సినిమా కథ, ఎన్టీఆర్ కు చెప్పిన కథ రెండు ఒకటే అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చాడట బుచ్చిబాబు. ఎన్టీఆర్ కు చెప్పిన కథ వేరని.. చరణ్ కోసం బుచ్చిబాబు కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేసాడని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాకి ఏఆర్ రహమాన్(AR RA) సంగీతం అందిస్తున్నాడు.