టాలీవుడ్‌లో మరో విషాదం

టాలీవుడ్‌లో మరో విషాదం

చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే సీనియర్ నటి జమున మృతి చెందగా.. తాజాగా ప్రముఖ తెలుగు దర్శకుడు సాగర్ (70) (విద్యా సాగర్ రెడ్డి 70) కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడు సాగర్ రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్‌గా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, అన్వేషణ లాంటి సినిమాలను సాగర్ తీశారు.

సాగర్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సాగర్‌ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘రాకాసి లోయ’తో మొదటిసారి దర్శకుడిగా అడుగులు వేశారు. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.