దిశ ఎన్ కౌంటర్ పై చివరి దశకు చేరిన విచారణ

దిశ ఎన్ కౌంటర్ పై చివరి దశకు చేరిన విచారణ

హైదరాబాద్: దిశ ఎన్ కౌంటర్ పై  సిర్పుర్కర్  కమిషన్  విచారణ  చివరి దశకు  చేరుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  దగ్గర   చటాన్ పల్లిలో  ఎన్ కౌంటర్ జరిగిన  ప్రదేశాన్ని, టోల్ గేట్  పరిసర ప్రాంతాలను పరీశీలించారు  కమిషన్ సభ్యులు. దిశ   మృతదేహాన్ని దహనం  చేసిన  స్థలాన్ని కూడా పరిశీలించారు.  దిశ కమిషన్  పర్యటన  సందర్భంగా   స్థానిక పోలీసులతో పాటు  సీఆర్పీఎఫ్ బలగాలతో  బందోబస్తు  ఏర్పాటు చేశారు. దిశ  కమిటీ  వెంట సైబరాబాద్ కమిషనర్  స్టీఫెన్ రవీంద్ర,  శంషాబాద్ జోన్   డీసీపీ  ప్రకాశ్ రెడ్డి,   సీపీ మహేష్ భగవత్  ఉన్నారు. దిశ ఎన్ కౌంటర్ ఘటనపై  పూర్తిస్థాయి  విచారణ  తర్వాత   ఫిబ్రవరి 2న  సుప్రీం కోర్టుకు నివేదిక  సమర్పించనుంది దిశ కమిషన్.