
ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం ఘటనలో మరో కొత్త వీడియో బయటకొచ్చింది. జూన్ 12న జరిగిన ఈ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వస్ కుమార్ రమేష్ క్రాష్ సైట్ నుంచి బయటకు నడుస్తున్నట్లు మరో కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది.
మెడికల్ కాలేజీ హాస్టల్ ఆవరణ నుంచి బయటకు వెళుతుండగా అతని వెనుక ఉన్న క్రాష్ సైట్ నుంచి దట్టమైన పొగలు ఎగిసిపడుతున్నాయి. రమేష్ వైట్ టీ షర్టులో నడుస్తూ ఎడమ చేతిలో ఫోన్ పట్టుకుని ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. అతడి వెనకాల అగ్ని పర్వతంలా మండుతోన్న విమాన ప్రమాద దృశ్యాలు కనిపిస్తున్నాయి. దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో పాటు చాలా మంది గందరగోళంతో పరుగెడుతూ కనిపిస్తున్నారు. ఇంతకు ముందు విమాన ప్రమాదం జరిగిన 33 సెకన్లకే ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో రమేష్ గాయాలతో రక్తం కారుతూ నడుస్తూ కనిపించాడు.
અવિશ્વસનીય પરંતુ સત્ય!
— Sagar Patoliya (@kathiyawadiii) June 16, 2025
અમદાવાદ પ્લેન ક્રેશમાં ચમત્કારિક રીતે બચેલા રમેશ વિશ્વાસનો વધુ એક વિડિઓ સામે આવ્યો.
દુર્ઘટના થયા પછી હાથમાં ફોન સાથે ચાલીને બહાર નીકળ્યો રમેશ વિશ્વાસ. #AhmedabadPlaneCrash pic.twitter.com/94WDepkKjn
జూన్ 12న అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. పైలెట్లు, విమాన సిబ్బంది, ప్రయాణికులు అంతా సజీవ దహనమయ్యారు. అయితే మెడికల్ కాజేసీ హాస్టల్ పై పడటంతో మరింత మంది మృతి చెందారు. లండన్కు బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో 242 మందిలో 241 మంది మరణించారు. విమానంలోని 11A సీటులో కూర్చున్న రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు.
రమేష్ విశ్వస్ కుమార్ బుచర్వాడా.. ఇంగ్లండ్ నివాసి .ఎరోప్లేన్ సీటింగ్ ప్లాన్ చేసే ఎయిరోలోపా (Aerolopa) ప్రకారం.. సీట్ 11A అనేది ఎకానమీ క్లాస్ క్యాబిన్ లో మొదటి వరుసలో ఉంటుంది. Air India Boing 787-8 డ్రీమ్ లైనర్స్ విమానంలో ఇది ఫస్ట్ రో లోనే ఈ సీటు ఉంటుంది. ప్లేన్ రెక్కలకు ముందు రెండు వరుసల దూరంలో , ఎకానమీ క్లాస్ లో మొదటి వరుసలో ఈ సీట్ ఉంటుంది. డోర్ కు కుడివైపు ఉండే ఈ సీటు.. ఎమర్జెన్సీ సమయంలో తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. పైన ఫోటోలో చూపినట్లుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు అవకాశం ఉండేలా సీట్ ను ఏర్పాటు చేస్తారు. రెక్కలకు రెండు వరుసల ముందు ఉండటం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండటం అతనికి కలిసొచ్చిందని అధికారులు అంటున్నారు.