
న్యూఢిల్లీ: సడెన్ గా 48 మంది పైలెట్లను ఉద్యోగాల నుంచి ఎయిరిండియా తీసేసింది. వీరందరూ గతేడాది తమ రాజీనామాలను ఇచ్చినా, ఆరు నెలల నోటీస్ పీరియడ్లో తమ రాజీనామాలను తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఈ రాజీనామాలను వెనక్కి తీసుకోవడాన్ని అప్పుడు ఎయిరిండియా అంగీకరించింది కూడా. కానీ సడెన్ గా వీరిని తమ విధుల నుంచి తొలగించింది. ఎయిర్ బస్ 320 విమానాలను నడిపేందుకు ఈ పైలెట్లను నియమించుకున్నారు. కరోనా దెబ్బతో కంపెనీ ఆపరేషన్స్ ఆగిపోయాయి. తిరిగి ఎప్పుడు మొదలవుతాయో తెలియడంలేదని ఎయిరిండియా పేర్కొంది. కంపెనీ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని, ఉద్యోగులకు జీతాలిచ్చే పొజిషన్ లో లేదని మేనేజ్ మెంట్ తెలిపింది.