విలీనం ఒప్పందంపై వాల్ట్ డిస్నీ, రిలయన్స్ సంతకాలు

విలీనం ఒప్పందంపై వాల్ట్ డిస్నీ, రిలయన్స్ సంతకాలు

న్యూఢిల్లీ: వాల్ట్ డిస్నీ,  రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు భారతదేశంలో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేయడానికి  బైండింగ్ అగ్రిమెంట్​పై సంతకం చేశాయి . ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్​కు విలీన సంస్థలో 61శాతం వాటా ఉంటుంది. ఇందుకోసం అది రూ.10 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్​ చేయనుంది.

డిస్నీకి  మైనారిటీ వాటా ఉన్న  డీటీహెచ్​ కంపెనీ టాటా ప్లే లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయడం గురించి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆలోచిస్తోంది. ప్రస్తుతం, టాటా సన్స్​కు  టాటా ప్లేలో 50.2శాతం వాటా ఉంది. మిగిలిన షేర్లు సింగపూర్‌‌‌‌‌‌‌‌లోని ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ సంస్థ అయిన డిస్నీ  టెమాసెక్ వద్ద ఉన్నాయి.   విలీనం పూర్తయితే అత్యంత శక్తివంతమైన మీడియా సంస్థ ఏర్పాటవుతుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.