బోథ్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బోథ్ లోని రైతు వేదికలో బుధవారం కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్గాలు దాడికి దిగాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం గొడవకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే..
చెక్కుల పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో స్టేజీపై ఎమ్మెల్యే అనిల్జాదవ్ పక్కన మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి కూర్చోవడంతో ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ వారు ఏ అర్హతతో స్టేజీపై కూర్చున్నారని ప్రశ్నించారు.
ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటు చేసుకోగా, బీఆర్ఎస్నాయకులు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, రాజుయాదవ్పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్ తన వర్గీయులతో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయాలపాలైన వారితో కలిసి పోలీస్స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి గొడవతో చెక్కులు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.
