ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బుల పంపిణీ.. రూ.10 వేలు పట్టుకున్న సీఐ

ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బుల పంపిణీ.. రూ.10 వేలు పట్టుకున్న సీఐ

 నల్లగొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం వెళ్లింది. ఈ క్రమంలోనే పోలీసులు పోలింగ్ కేంద్రం ముందు తనిఖీ చేశారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజి పోలింగ్ కేంద్ర ముందు ఓటర్లకు డబ్బులు పంచుతున్న వారిని పట్టుకున్నారు. ఓ వ్యక్తి వద్ద రూ. 10 వేల పట్టుకున్నారు సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి. ఆ డబ్బులు బీఆర్ఎస్ నాయకులవేనని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.
 
మరోవైపు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల దగ్గరే బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల పంపిణీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. డబ్బులతో పట్టభద్రుల మనసును దోచుకోలేరని తెలిపారు ప్రేమేందర్ రెడ్డి.