
మహబూబాబాద్/ రేగొండ/ జనగామ అర్బన్/ వరంగల్ సిటీ/ ములుగు/ హనుమకొండ కలెక్టరేట్ వెలుగు: గ్రీవెన్స్లో ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణి నిర్వహించగా, మహబూబాబాద్లో 148 వినతులు వచ్చాయని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. జయశంకర్భూపాలపల్లిలో కలెక్టర్ రాహుల్శర్మ ప్రజల నుంచి మొత్తం 57 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. జనగామలో 59 వినతులు వచ్చాయని కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్ తెలిపారు.
అనంతరం ప్రభుత్వ పథకాల అమలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ బల్దియా హెడ్ఆఫీస్లో నిర్వహించిన గ్రీవెన్స్కు మొత్తం 109 దరఖాస్తులు వచ్చాయని, అందులో 49 టౌన్ ప్లానింగ్పైనే ఉన్నాయని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు 85 అర్జీలు వచ్చాయని కలెక్టర్ దివాకర తెలిపారు. ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్లు ఆదేశించారు.హనుమకొండ గ్రీవెన్స్లో 176 అర్జీలు వచ్చాయని కలెకట్ర్ స్నేహ శబరీశ్ తెలిపారు.