రాష్ట్రం వచ్చినా పేదల బతుకులు మారలే: బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ

రాష్ట్రం వచ్చినా  పేదల బతుకులు మారలే: బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్  డీకే అరుణ

గద్వాల, వెలుగు: రాష్ట్రం వచ్చి పదేండ్లు అయినా పేదల బతుకులు మారలేదని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ విమర్శించారు. మంగళవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. గద్వాల మండలంలోని అనంతపురం, బీరెల్లి, గుర్రం గడ్డ, బస్సపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్​.. ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదన్నారు. కేసీఆర్​ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్ రాములు, శ్రీనివాస్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.