కల్వకుంట్ల ఫ్యామిలీ చేతిలో తెలంగాణ బందీ అయింది: డీకే అరుణ

కల్వకుంట్ల ఫ్యామిలీ చేతిలో తెలంగాణ బందీ అయింది: డీకే అరుణ

గద్వాల, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామిలీ చేతిలో బందీగా మారిందని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ అన్నారు. బుధవారం గద్వాల మండలంలోని చెనుగొనిపల్లి, కొత్తపల్లి, మదనపల్లి, గుంటిపల్లి, రేకులపల్లి, ఇడుగొనిపల్లి గ్రామాల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని కేసీఆర్​ మోసం చేశారని, అన్ని వర్గాల ప్రజలు గత కొంతకాలంగా కేసీఆర్​పై వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో  బీజేపీ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు బండల వెంకట్ రాములు, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, తిరుపతి   పాల్గొన్నారు.
 

కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

వనపర్తి : అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. బుధవారం వనపర్తి మండలంలోని చందాపూర్ గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎద్దుల దేవేందర్ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు బి.కృష్ణ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నిరుపేదల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అనంతరం గ్రామంలో  గడపగడపకూ ప్రచారం చేశారు. 

ప్రభుత్వ పథకాల కరపత్రాలు ఇస్తూ.. ప్రతి ఇంటికీ బీజేపీ స్టిక్కర్స్ అతికించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎద్దుల దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు నాయకులు బాలరాజు, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.