కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే: డీకే అరుణ

కాంగ్రెస్ కు  ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే:  డీకే అరుణ

గద్వాల, వెలుగు: కాంగ్రెస్ కు  ఓటేస్తే  బీఆర్ఎస్ కు వేసినట్టేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం ఇందువాసి, గద్వాలలోని 30 వ వార్డులో పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీలో చేరగా వారికి కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఓటమి భయంతో స్కీముల పేరుతో బీఆర్ఎస్ వాళ్లు అమాయక ప్రజలను బెదిరించి చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. 

కొందరు నియోజకవర్గ గురించి తెలియని వారు కూడా  డబ్బుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అనంతరం వినాయకుల ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.  తరువాత పార్టీ కేటీ దొడ్డి  మండల ప్రెసిడెంట్ గా అనిమిరెడ్డిని ఎన్నుకున్నారు.  కార్యక్రమంలో గడ్డ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శివారెడ్డి  పాల్గొన్నారు.