చెడు వ్యసనాలకు బానిస కావొద్దు : గంట కవితాదేవి

చెడు వ్యసనాలకు బానిస కావొద్దు : గంట కవితాదేవి

గద్వాల, వెలుగు: విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని డీఎల్ఎస్ఏ సెక్రటరీ గంట కవితాదేవి సూచించారు. మంగళవారం బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్​ బాయ్స్​ హైస్కూల్​లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలని, సెల్​ఫోన్లకు బానిస కావద్దన్నారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్  నెంబర్ ఇవ్వవద్దని, వీడియో కాల్స్, ఫోన్​లో చాటింగ్​ చేయవద్దని సూచించారు. హెచ్ఎం ఇమాన్యుల్, లాయర్లు ప్రభాకర్, లక్ష్మన్న పాల్గొన్నారు.

క్రమశిక్షణతో చదవాలి..

నాగర్ కర్నూల్ టౌన్: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ జి సబిత ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో జరిగిన బాలల దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలతో శారీరక, మానసిక సమస్యలు వస్తాయని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే డయల్​100కు ఫోన్​ చేయాలన్నారు. పేద మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. అనంతరం కబడ్డీ, ఖోఖో పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. న్యాయవాదులు మధుసూదన్ రావ్, బాబు, ప్రశాంత రావు, రాంచందర్  పాల్గొన్నారు.

బాలల హక్కులను కాపాడాలి..

వనపర్తి: బాలల హక్కులను కాపాడాలని వనపర్తి న్యాయమూర్తి రజని సూచించారు. తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్​ స్కూల్, కాలేజీలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాలల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాల నిషేధం, బాధ్యతలను జడ్జి వివరించారు. న్యాయవాది డి.కృష్ణయ్య, సఖి కేంద్రం ఇన్​చార్జి గోవర్ధన్, టీచర్లు పాల్గొన్నారు.