
ధర్మసాగర్/ కొత్తగూడ (గంగారం)/ బచ్చన్నపేట, వెలుగు: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల డీఎంహెచ్వోలు సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలో నిర్వహిస్తున్న డ్రైడే కార్యక్రమం, ఫీవర్ సర్వే హెల్త్ క్యాంపులను డీఎంహెచ్వో అప్పయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఎంహెచ్వో మదన్మోహన్రావు, ఇతర అధికారులు, ఆశ కార్యకర్తలతో కలిసి నీటినిల్వ ప్రదేశాలను పరీక్షించి, పలు సూచనలు చేశారు.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం గంగారం, కోమట్లగూడెం పీహెచ్సీలు, దుబ్బగూడెం, మర్రిగూడెంలలోని ఆయుష్మాన్ హెల్త్ సెంటర్లను డీఎంహెచ్వో రవిరాథోడ్ తనిఖీ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని డీహెంహెచ్వో మల్లికార్జున్ సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి, డాక్టర్లు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. అనంతరం 23మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను అందజేశారు.