సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు : సుప్రీంకోర్టు

సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు  : సుప్రీంకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర  ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.  హైకోర్టు అదేశాలపై  స్టే ఇస్తే అవినాష్ ను సీబీఐ అరెస్ట్ చేస్తుందని ఆయన తరుపు లాయర్లు వాదించారు.  

దీంతో అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 24  సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు ఆ రోజున అన్ని విషయాలు పరిశీలిస్తామని విచారణను వాయిదా వేసింది. ఈ నెల 25 వరకూ అవినాష్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. 

ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది.