లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా పోలింగ్ బూత్ లకు ఓటర్లు ఎలా రావాలో కూడా సూచించడంతో పాటు… ఎలాంటి వస్తువులు తీసుకు రాకూడదో కూడా తెలిపారు సైబరాబాద్ పోలీసులు. సెల్ఫోన్, లైటర్, గన్, అగ్గిపెట్టె, వాటర్ బాటిల్, ఇంక్ బాటిల్, కర్ర, కెమెరా, రాయి, కత్తి, స్క్రూ డ్రైవర్ లాంటి వస్తువులపై నిషేధం విధించారు. ఎవరైనా వీటితో పోలింగ్ బూత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ఓటర్లకు సూచించారు.