
వాషింగ్టన్: ఇండియా, పాకిస్తాన్ దేశాలను బెదిరించి, యుద్ధం ఆపానంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే పాట పాడారు. శుక్రవారం ఆయన వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు. ‘‘యుద్ధం ఆపకపోతే రెండు దేశాలతో అన్ని ట్రేడ్ డీల్స్ రద్దు చేసుకుంటామని హెచ్చరించాలని వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ను, ట్రెజరీ మంత్రి స్కాట్ బెస్సెంట్ను ఆదేశించా.
రెండు దేశాలు కొట్లాడుకుంటూ, అణు బాంబులు వేసుకునే పరిస్థితికి వెళ్తే అమెరికా అన్ని రకాల వాణిజ్య సంబంధాలను కట్ చేసుకుంటుందని చెప్పాలన్నా. దీంతో రెండు దేశాలు దిగివచ్చి, యుద్ధం ఆపేశాయి” అని ట్రంప్ చెప్పారు. అణు యుద్ధాన్ని ఆపడం ద్వారా తాను గొప్ప పని చేశానన్నారు. కాగా, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్పై దాడులు చేసింది. పాక్ కాళ్ల బేరానికి రావడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది.