అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ వ్యవహారంలో కలుగజేసుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ లైన్ దాటొద్దని అమెరికాకు సూచించారు. తమ దేశ ప్రయోజనాలతో ముడిపడిన అత్యంత కీలకమైన తైవాన్ అంశంలో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా నడుచుకుంటే చైనా, అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదన్నారు. జీ20 సమావేశాల కోసం ఇండోనేషియాలోని బాలీకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.
ఉక్రెయిన్ లోని పరిస్థితులపైనా ఇద్దరు నేతలు చర్చించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరిగే శాంతి చర్చలకు తమవంతు సహకారం అందిస్తామని బైడెన్ కు జిన్ పింగ్ హామీ ఇచ్చారు. అమెరికా, చైనాలు అభివృద్ధిలో దూసుకుపోతూ.. ప్రపంచ మార్కెట్ లో పరస్పరం పోటీపడాలని పేర్కొన్నారు.