సిడ్నీలో లాక్ డౌన్ మరింత కఠినతరం

సిడ్నీలో లాక్ డౌన్ మరింత కఠినతరం

కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద నగరమైన సిడ్నీలో లాక్ డౌన్ ను మరింత కఠినతరం చేశారు. గత 24 గంటల్లో 44 డెల్టా వేరియంట్ కేసులు నమోదు కావడంతో సిడ్నీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 

సిడ్నీలో లాక్ డౌన్ మూడో వారానికి చేరుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఇప్పుడే ఏర్పడిందని అధికారులు చెప్పారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తుండటంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. జూన్ మధ్య నుంచి సిడ్నీలో 439 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా జనాభాలో ఇప్పటి వరకు కేవలం 9 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు.