
- జర్నలిస్టులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హితవు
ఖైరతాబాద్, వెలుగు: నేటి జర్నలిస్టులు విలువలతో కూడిన జర్నలిజాన్ని వదిలి సెన్సేషన్కోసం తపిస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి పద్మ విభూషణ్పురస్కార గ్రహీత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రెడ్హిల్స్ లో సీనియర్ జర్నలిస్టు అరుణ రవికుమార్రచించిన ‘దేర్ఐ వాజ్’ అనే పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జర్నలిజంతో పాటు రాజకీయాల్లోనూ ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. సెన్సేషన్కోసం పాకులాడుతూ సెన్స్లేని రాతలు రాయొద్దని కోరారు. ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్మాట్లాడుతూ.. తాను ఈ పుస్తకాన్ని చదివానని వివరించారు. అందరికీ నచ్చే విధంగా పుస్తకాన్ని రాశారని ప్రశంసించారు.