
భారత మహిళల హాకీ మాజీ కెప్టెన్ వైఖోమ్ సూరజ్ లతా దేవి తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. బుధవారం ఇంఫాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె.. 2005లో వివాహం చేసుకున్నప్పటి నుంచీ తన భర్త శాంతా సింగ్ కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె తెలిపింది. ‘నా పెళ్లి తర్వాత నేను గెలిచిన పతకాలను మరియు ఫోటోలను నా అత్తవారింటికి తీసుకెళ్లాను. అది చూసిన నా భర్త.. వాటివల్ల ఏం ఉపయోగం అని ఎగతాళి చేశాడు. అంతేకాకుండా.. నేను నాపై వారితో చనువుగా ఉండటం వల్లే నాకు అర్జున అవార్డు వచ్చిందన్నారు. నా భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందనే నమ్మకంతోనే ఇప్పటివరకు ఈ విషయాలను బయటకు చెప్పలేదు. ఎవరికైనా కొంతమేరకే సహనం ఉంటుంది. ఇప్పుడు నా సహనం కోల్పోయాను. అందుకే ఆ విషయాలన్నీ బయటపెడుతున్నాను. నవంబర్ 2019లో పంజాబ్లోని కపుర్తాలాలో సుల్తాన్పూర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్వహించిన ఒక టోర్నమెంట్లో ఆడుతున్నప్పుడు నా భర్త నాపై తీవ్ర దాడి చేశాడు. అందుకే కేసు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాను’ అని లతా దేవి తెలిపారు.
లతా దేవి కెప్టెన్సీలో భారత్ 2002 కామన్వెల్త్ గేమ్స్లో మూడు బంగారు పతకాలు సాధించింది. అప్పటి కామన్వెల్త్ గేమ్స్లో లతా దేవి కెప్టెన్సీలో భారత్ సాధించిన విజయాలే షారూక్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ సినిమా నిర్మించడానికి ప్రేరణగా నిలిచాయి.
For More News..