చిప్ ఇండస్ట్రీ కోసం డీపీఆర్.. మంత్రి శ్రీధర్బాబుకు అందించిన టీ-చిప్

చిప్ ఇండస్ట్రీ కోసం డీపీఆర్.. మంత్రి శ్రీధర్బాబుకు అందించిన టీ-చిప్

న్యూఢిల్లీ: తెలంగాణను భారతదేశ సెమీకండక్టర్ల ఇండస్ట్రీలో టాప్​గా నిలపడానికి, టీ-–చిప్ (టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్) చైర్మన్  ఎండీ అండ్​ సీఈఓ  సుందీప్ కుమార్,  డీటెయిల్డ్​ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్​)ను ఐటీ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబుకు అందజేశారు. టీ–-చిప్ బృందం తైవాన్  హాంకాంగ్​లలో పర్యటించి, ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ కంపెనీలు టీఎస్​ఎంసీ, ఏఆర్ఎం, సైనాప్సిస్, ఫారడే టెక్నాలజీ, పీయూఎఫ్ సెక్యూరిటీ, గస్ టెక్నాలజీ, లిట్​మ్యాక్స్, సూపర్‌‌‌‌‌‌‌‌మైక్రో, నేషనల్ యాంగ్ మింగ్ చియావో తుంగ్ యూనివర్సిటీ (ఎన్​వైసీయూ), తైవాన్ సెమీకండక్టర్ రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ (టీఎస్ఆర్ఐ), టీఏఐఆర్​ఓఎస్ (తైవాన్ ఆటోమేషన్ ఇంటెలిజెన్స్  రోబోట్ షో) నుంచి సేకరించిన సమాచారంతో డీపీఆర్​ రూపొందించారు.

ఇది అధునాతన చిప్ డిజైన్, తయారీ నమూనాలు  అత్యాధునిక అప్లికేషన్ల గురించి పూర్తి వివరాలను అందిస్తుంది. తెలంగాణను సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చేందుకు ప్రొఫెసర్లకు, స్టూడెంట్లకు సెమీకండక్టర్ టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వాలని టీ–చిప్​ సిఫార్సు చేసింది.