
- ఈ నియోజకవర్గం నుంచి నాలుగో మంత్రి
- మచ్చలేని నాయకుడిగా వివేక్ వెంకటస్వామికి పేరు
- ఆయనకు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్శ్రేణుల సంబరాలు
కోల్బెల్ట్, వెలుగు:రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖానాపూర్నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, వెడ్మా బొజ్జు పటేల్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన వివేక్ వెంకటస్వామి, వినోద్, ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవులను ఆశించారు. చివరకు మాల సామాజికవర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కింది.
చెన్నూరుకు మరోసారి కలిసివచ్చిన అవకాశం
తండ్రి దివంగత గడ్డం వెంకటస్వామి వారసత్వంగా కాంగ్రెస్రాజకీయ అరంగేట్రం చేసిన వివేక్ వెంకటస్వామి 2009లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని మొదట వివేక్ భావించినా.. చెన్నూరులో బాల్క సుమన్ను ఓడించే సత్తా వివేక్ వెంకటస్వామికే ఉందని భావించిన కాంగ్రెస్అధిష్టానం ఆయనను ఎమ్మెల్యేగా బరిలో దింపి సక్సెస్అయ్యింది.
పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతంలో కేంద్ర మాజీ కాకా వెంకటస్వామి కుటుంబానికి ఎన్నో ఏండ్లుగా పేరుంది. ఆ కుటుంబం అధికారంలో ఉన్నా లేకున్నా పార్లమెంట్ ప్రజలకు సేవలు చేస్తున్నారు. విశాక ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉన్నారు. కార్మిక నేపథ్యం కలిగిన పార్లమెంట్ పరిధిలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు కాకా కుటుంబానికి అండగా నిలుస్తున్నాయి.
మృధుస్వభావిగా పేరు
2009లో జరిగిన ఎన్నికల్లో వివేక్ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్నుంచి బరిలో నిలిచి గెలిచారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నలభై ఏళ్లుగా కాకా వెంకటస్వామి, వినోద్, వివేక్ వెంకటస్వామి, ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇక్కడ ప్రజలకు సేవలందిస్తున్నారు. 2004–09లో చెన్నూరు నుంచి కాకా పెద్ద కుమారుడు గడ్డం వినోద్ గెలిచి రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేయగా.. అదే స్థానం నుంచి బరిలో నిలిచిన చిన్న కుమారుడు వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డి కేబినెట్లో తాజాగా మంత్రిగా చోటు దక్కించుకున్నారు.
మృధుస్వభావిగా పేరున్న వివేక్ రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రజలతో మమేకమై సమస్యల పరష్కారానికి కొట్లాడే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన స్థాయిలో ఉన్నప్పటికీ సామాన్య కార్యకర్తలతో ఆయన కలిసిపోతారనే పేరుంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో వందకోట్ల ఫండ్స్తో అభివృద్ధి పనులు చేపట్టారు. మంత్రిగా ఛాన్స్ రావడంతో తమ నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చెన్నూరు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల పరిష్కారంపై సింగరేణి కార్మికుల ఆశలు
సింగరేణి కార్మికులతో కాకా వెంకటస్వామి కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. 1990లో ఎంపీగా ఉన్న కాకా వెంకటస్వామి ఎన్టీపీసీతో మాట్లాడి రూ.450 కోట్ల రుణాన్ని సింగరేణికి ఇప్పించారు. దీంతో సింగరేణి 1999 నాటికి లాభాల్లోకి వచ్చింది. వెంకటస్వామి చొరవతో సంస్థ మనుగడతో పాటు లక్షా 20 వేల మంది ఉద్యోగాలను కాపాడారు. 1995లో బొగ్గుగని కార్మికులకు ప్రత్యేకంగా పెన్షన్ స్కీం అమలు చేయించారు. మంచిర్యాల జిల్లా జైపూర్వద్ద 2006లో సింగరేణి ఆధ్వర్యంలో 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ను నెలకొల్పేలా కాకా వెంకటస్వామి, అప్పటి మంత్రి గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ వివేక్ వెంకటస్వామి చొరవ చూపారు.
2009లో గోదావరిఖని ప్రాంతంలో 17వేల మందికి సింగరేణి స్థలాల్లో ఇండ్ల పట్టాలు ఇప్పించి కార్మికుల అభిమానాన్ని చూరగొన్నారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో వచ్చిన వివేక్ వెంకటస్వామి సింగరేణీయుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తునారు. పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన కాలంలో పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి మీదుగా కొత్త ఎక్స్ప్రెస్ రైలును వేయించారు. పలు రైళ్లలకు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. క్యాతనపల్లి, రామగుండంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలను మంజూరు చేయించి, రామగుండం ఎరువుల కార్మాగారం రీ ఓపెన్ చేయించారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సింగరేణిలో కాంట్రాక్ట్ పనులన్నీ 80శాతం స్థానికులకే ఇవ్వాలని సీఎంను ఒప్పించి సర్క్యూలర్ జారీ చేయించారు.
కోల్బెల్ట్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు మందమర్రిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయించారు. జైపూర్ పవర్ప్లాంట్లో 800 మెగావాట్ల మూడో యూనిట్ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. సింగరేణి ఆఫీసర్ల పీఆర్పీ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా సింగరేణి కార్మిక రంగ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సింగరేణి కార్మికవర్గం ఆయనపై భారీ ఆశలు పెట్టుకుంది.
నియోజకవర్గం నుంచి నాలుగో మంత్రి
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు 20 మంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించగా.. 21వ మంత్రిగా వివేక్ వెంకటస్వామి ప్రమాణస్వీకారం చేశారు. చెన్నూరు స్థానం నుంచి మంత్రి పదవి చేపట్టిన నాలుగో మంత్రి ఆయన. గతంలో కోదాటి రాజమల్లు, బోడ జనార్ధన్, గడ్డం వినోద్ మంత్రి పదవులు చేపట్టారు. రాజమల్లు తొలి కాంగ్రెస్ మంత్రి కాగా వినోద్(2004–09) రెండో మంత్రి.
ఇప్పుడు ఆయన సోదరుడు వివేక్ మూడో మంత్రి అయ్యారు. జిల్లాల పునర్విభజన అనంతరం మంచిర్యాల జిల్లాలో తొలి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. దీంతో కాకా కుటుంబం నుంచి వివేక్ మూడో మంత్రి అయ్యారు. వివిధ సమీకరణాలు, రాజకీయాల పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు ఏడాదిరన్న కాలం తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కింది.