డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభం రూ.1,437 కోట్లు.. రెండో క్వార్టర్లో 14 శాతం వృద్ధి

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభం రూ.1,437 కోట్లు.. రెండో క్వార్టర్లో 14 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబోరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​ (జూలై-–సెప్టెంబర్​) ఫలితాలను ప్రకటించింది. గత సెప్టెంబరుతో పోలిస్తే పన్ను తర్వాత నికర లాభం (పీఏటీ)లో 14.5 శాతం పెరిగింది. 

బ్రాండెడ్​ మార్కెట్లలో భారీ అమ్మకాలతో ఇది రూ. 1,437 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం గతేడాది ఇదే క్వార్టర్​లో రూ. 8,016 కోట్లు ఉండగా, ఈ క్వార్టర్​లో రూ. 8,805 కోట్లకు పెరిగింది. బ్రాండెడ్​ మార్కెట్లలో వృద్ధి,  నికోటిన్​ రీప్లేస్​మెంట్​ థెరపీ (ఎన్​ఆర్​టీ) నుంచి భారీ ఆదాయం వల్లే రెండో క్వార్టర్​లో వృద్ధి సాధ్యమైందని కంపెనీ తెలిపింది. 

యూఎస్​ లెనాలిడోమైడ్​ అమ్మకాలు తగ్గినా, దీని వృద్ధి బాగుందని కంపెనీ కో–-చైర్మన్,  ఎండీ జీవీ ప్రసాద్​ తెలిపారు. ఈసారి  నార్త్​ అమెరికా మార్కెట్లో అమ్మకాలు 13 శాతం తగ్గి రూ. 3,241 కోట్లుగా నమోదయ్యాయి.  యూరప్ నుంచి ఆదాయం రూ. 1,376 కోట్లకు పెరిగింది.  భారతదేశ మార్కెట్​ ఆదాయం 13 శాతం పెరిగి రూ. 1,578 కోట్లకు చేరుకుంది. 

ఎమర్జింగ్​ మార్కెట్స్ ఆదాయం 14 శాతం వృద్ధి చెంది రూ. 1,655 కోట్లుగా నమోదైంది.  ఫార్మాస్యూటికల్​ సర్వీసెస్​  యాక్టివ్​ ఇంగ్రిడియెంట్స్​  ఆదాయం 12 శాతం పెరిగి రూ. 945 కోట్లుగా ఉంది. కంపెనీ షేర్లు శుక్రవారం 0.32 శాతం పెరిగి రూ. 1,284 వద్ద ముగిశాయి.