- ఇల్లినాయిస్ మెడికల్ కాలేజీ హెడ్ వేమూరి ఎస్ మూర్తి
- గాంధీలో వర్క్షాప్ లో ప్రజంటేషన్
పద్మారావునగర్, వెలుగు : ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో పేషెంట్లకు ఆధునిక వైద్య సదుపాయాలను సత్వరమే అందించవచ్చని చికాగోలోని ఇల్లినాయిస్ కాలేజీ ఆఫ్ మెడిసిన్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ఎండీ డాక్టర్ వేమూరి ఎస్ మూర్తి పేర్కొన్నారు.
సోమవారం గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల సంయుక్తాధ్వర్యంలో గాంధీ అలూమ్ని ఆడిటోరియంలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్లినికల్ కేస్ డిస్కషన్ వర్క్షాప్లో ఆయన ప్రొగ్రాం డైరెక్టర్గా పాల్గొని ప్రజంటేషన్ చేశారు. స్క్రీన్పై పేషెంట్ ను చూపుతూ ఎమర్జెన్సీలో ఏఐ టెక్నాలజీతో ఆటోమెటిక్ గా డయాగ్నోసిస్ చేయవచ్చనేది వివరించారు. అనంతరం డాక్టర్లు గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ అలూమ్ని అసోసియేషన్ జీఆర్ లింగమూర్తి, సెక్రటరీ డా. రత్నం, డా. మహేశ్వర్ పర్వతరెడ్డి, గాంధీ అనస్థీషియా ప్రొఫెసర్ డా.నాగార్జున చక్రవర్తి, గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల డాక్టర్లు పాల్గొన్నారు.